డ్యామ్‌లో ఏర్పడిన గొయ్యి.. దాని తీవ్రతపై అధ్యయనం

Published: Friday May 03, 2019
శ్రీశైలాన్ని ముంచెత్తిన వరద నీటిని క్రస్ట్‌గేట్లను తెరిచి విడుదల చేయడంతో, గేట్ల ముందుభాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. à°† గొయ్యి డ్యామ్‌పై చూపించగల ప్రభావంపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులు.. నిపుణులతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. డ్యామ్‌కు ప్రమాదం ఉందా? అది నిజమైతే, దాని తీవ్రత à°Žà°‚à°¤? డ్యామ్‌ పునాదుల దాకా à°ˆ గొయ్యి ఉందా? అనే దానిపై గోవా, విశాఖకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషినోగ్రఫీ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు.అందులోభాగంగా గురువారం నుంచి డ్యాం ఫ్లంజ్‌పూల్‌ వద్ద అండర్‌వాటర్‌ వీడియోగ్రఫీ సర్వే చేపట్టారు.
 
 
à°ˆ సర్వే కోసం ఎనిమిది మంది శాస్త్రవేత్తలు శ్రీశైలం చేరుకున్నారు. తొలిరోజు ప్రాథమికంగా ఫ్లంజ్‌పూల్‌ వద్ద నీటిలో à°Žà°‚à°¤ లోతు వెళ్లవచ్చునని ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ సర్వే చేపట్టారు. పది రోజుల పాటు à°ˆ సర్వే చేస్తారు. గతంలో చేపట్టిన బ్యాతమాటికల్‌, అండర్‌వాటర్‌ వీడియోగ్రఫీ సర్వే నివేదికలను క్రోడీకరించుకుని ప్రస్తుత సర్వే నివేదికను విజయవాడలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌à°•à°¿ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిపుణుల బృందానికి పంపిస్తారు. వారి సూచనల మేరకు ఫ్లంజ్‌పూల్‌ పటిష్ఠతకు చేపట్టే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. డ్యామ్‌ మెయింటెనెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సాంబశివారెడ్డి, డీఈ గోపాల్‌నాయక్‌, ఏఈ లక్ష్మీనారాయణ à°ˆ పనులను పర్యవేక్షిస్తున్నారు.