బార్బర్‌షాప్‌ గాళ్స్‌ను కలుసుకున్న సచిన్‌

Published: Sunday May 05, 2019
 à°¸à°šà°¿à°¨à±‌ టెండూల్కర్‌ షేవింగ్‌ చేసుకున్నాడు. అదేంటీ అతనెప్పుడూ క్లీన్‌షేవ్‌తోనే కనిపిస్తాడు కదా అనుకుంటున్నారా..? ఇక్కడ విశేషమేమిటంటే సచిన్‌ తొలిసారిగా సెలూన్‌లో షేవింగ్‌ చేయించుకున్నాడు. అదీ అమ్మాయిలతో. అవును.. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విపరీతంగా చర్చకు కారణమైన ‘బార్బర్‌షాప్‌ గాళ్స్‌’ నేహ, జ్యోతి అనే అమ్మాయిలు నిర్వహిస్తున్న సెలూన్‌ షాప్‌లో సచిన్‌ గడ్డం గీయించుకున్నాడు. ‘మీకో విషయం తెలియకపోవచ్చు. నేనిప్పటిదాకా ఎవరితోనూ బయట షేవింగ్‌ చేయించుకోలేదు. à°† రికార్డు ఈరోజు బద్ధలైంది. బార్బర్‌షాప్‌ గాళ్స్‌ను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే జిల్లెట్‌ ఇండియా స్కాలర్‌షి్‌పను కూడా వారికి అందించా’ అని ట్విటర్‌ ద్వారా సచిన్‌ తెలిపాడు.
 
 
ఇదీ నేపథ్యం: ఉత్తరప్రదేశ్‌లోని బన్వరీ తోలా అనే గ్రామంలో నేహ, జ్యోతి à°ˆ సెలూన్‌ నిర్వహిస్తున్నారు. బార్బర్‌ వృత్తి కేవలం పురుషులకే కాదని నిరూపిస్తున్న à°ˆ ఇద్దరూ అటు చదువుకుంటూనే à°ˆ రంగంలోనూ విశేషంగా రాణిస్తున్నారు. తండ్రికి చేదోడువాదోడుగా తొలినాళ్లలో నేర్చుకున్న à°ˆ వృత్తే à°† తర్వాత వీళ్లకు జీవనోపాధి అయ్యింది. వీరి ప్రతిభ గురించి జిల్లెట్‌ కంపెనీకి తెలియడంతో à°ˆ అక్కాచెల్లెళ్ల ప్రస్థానంపై à°“ యాడ్‌ చేసి యూట్యూబ్‌లో ఉంచింది. ఇది వైరల్‌à°—à°¾ మారడంతో వీరికి మద్దతు తెలిపేందుకు సచిన్‌ కూడా ముందుకొచ్చాడు. ఈనేపథ్యంలోనే వారితో షేవింగ్‌ చేయించుకున్నాడు.