నగరంలో రేవ్ పార్టీ కల్చర్

Published: Monday May 06, 2019

విశాఖపట్నం: à°¨à°—రంలో రేవ్ పార్టీ కల్చర్ పెరుగుతుండటంతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు రాజకీయ నాయకులకు తలొగ్గితే విశాఖ డ్రగ్స్ నగరంగా మారుతుందని అన్నారు. ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ కేసుపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీలో మద్యం అనుమతించాలని à°“ మంత్రి ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి చేశారని, à°† మంత్రి పేషీ నుంచి ఎక్సైజ్ అధికారులకు అనేకసార్లు ఫోన్లు వెళ్లాయని విష్ణు ఆరోపించారు. సంబంధిత ఫోన్ కాల్స్ డేటా బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. విశాఖలో జరిగిన రేవ్ పార్టీపై ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందించకపోవడం దారుణం అన్నారు.