పోరాటం తప్ప మనకు పలాయనం తెలియదు

Published: Tuesday June 04, 2019

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి పోరాటం తప్ప పలాయనం తెలియదని, ప్రజల్లో ఉండి వారికోసం పనిచేసి అన్ని వర్గాల ఆదరణ, అభిమానాన్ని పొందుదామన్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన నేతలు సోమవారం ఆయన్ను ఇక్కడ కలిసి మాట్లాడారు. à°ˆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ఒకప్పుడు పాలన అనేక లోపాలమయంగా ఉండేది. టీడీపీ హయాంలో à°’à°•à°Ÿà°¿ రెండు లోపాలే ఉన్నాయి. వాటినే బూతద్దంలో పదేపదే చూపి వ్యతిరేకతగా చెబుతున్నారు. మన విధులు చిత్తశుద్ధితో నిర్వర్తించాం. మనం ఎక్కడా తప్పు చేయలేదు. ధైర్యంగా ముందుకు పోదాం. ముందు వాళ్లు చేస్తామని చెప్పినవన్నీ చేయనీయండి. వారికి కొంత సమయం ఇవ్వండి’ అని సూచించారు. కుప్పంలో తనకు ఈసారి మెజారిటీ తగ్గడంపై అసెంబ్లీ సమావేశాల అక్కడ పర్యటించి ఏం జరిగిందో అధ్యయనం చేస్తానని తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టును పడకేయిస్తే రాష్ట్రం పురోగమిస్తుందా? రాయలసీమకు నీటి కొరత ఎలా తీరుతుంది? కుప్పం వరకూ నీళ్లెలా చేరతాయి? వీటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. హంద్రీనీవా కాల్వ ద్వారా కుప్పం శివారు వరకూ నీళ్లు తేగలిగాం. టీడీపీకి మరో అవకాశం ఇచ్చి ఉంటే సీమలో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేవారం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.