కుటుంబంలో పిల్లలెందరున్నా అమ్మ ఒడి ఒకరికే

Published: Saturday July 13, 2019

 à°¨à°µà°°à°¤à±à°¨à°¾à°²à±à°²à±‹ ఒకటైన ‘అమ్మఒడి’ పథకం కోసం బడ్జెట్‌లో రూ.6455.80 కోట్లు కేటాయించారు. ఇందులో à°’à°•à°Ÿà°¿ నుంచి పదోతరగతి వరకు పిల్లలకు రూ.5,595 కోట్లు, ఇంటర్‌ విద్యార్థులు రూ.860 కోట్లు అందజేస్తారు. à°’à°• కుటుంబంలో చదివే పిల్లలు ఎందరున్నా, తల్లికి మాత్రమే à°ˆ పథకం లబ్ధిని అందిస్తామని శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని వెల్లడించింది. ‘అమ్మ à°’à°¡à°¿’ పథకాన్ని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింపజేయాలని సర్కారు తొలుత భావించింది. అయితే à°† తర్వాత ఇంటర్మీడియెట్‌ వరకు à°ˆ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో à°’à°•à°Ÿà°¿ నుంచి పదో తరగతి వరకు దాదాపు 70 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియెట్‌ కోర్సును సుమారు 10లక్షలమంది చదువుతున్నారు. అయితే వీరిలో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, అంటే తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండటం, à°’à°• కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ తల్లికే లబ్ధి చేకూర్చేలా à°ˆ పథకం నిబంధనలను రూపొందించారు. à°ˆ రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే ‘అమ్మ à°’à°¡à°¿’ పథకం à°•à°¿à°‚à°¦ దాదాపు 43లక్షల మంది అర్హులు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఇందులో 1 నుంచి పదో తరగతుల పిల్లలు 37.30లక్షల మంది కాగా, మిగిలిన 5.73లక్షల మంది ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు. వీరందరికీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో వచ్చే జనవరి 26à°¨ ‘అమ్మ à°’à°¡à°¿’ పథకం à°•à°¿à°‚à°¦ రూ.15వేల చొప్పున అందించనున్నారు. ఐ.à°Ÿà°¿.ఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుకునేవారికి కూడా ‘అమ్మ à°’à°¡à°¿’ పథకాన్ని వర్తింపజే యాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ à°† విషయం బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.