భారత్‌లో భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర

Published: Sunday August 11, 2019

 à°­à°¾à°°à°¤à°¦à±‡à°¶à°‚లో భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 కంటే ముందే భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. ఐసిస్ సహకారంతో జేషే, లష్కరే తోయిబా ఉగ్రవాదులు à°ˆ కుట్రకు తేరలేపినట్లు ఐబీ గుర్తించింది. కాగా, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు.. కశ్మీర్‌ను విభజిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. à°ˆ నిర్ణయంపై ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్‌లో దాడులకు ఉగ్రమూకలను పురిగొల్పే విధంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌లో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ à°† దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. à°ˆ క్రమంలో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోనున్నాయని ఇంటెలీజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.