మాజీ మంత్రి కార్యాలయం కూల్చివేతకు రంగం సిద్ధం

Published: Friday August 23, 2019
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావుకు చెందిన భీమిలిలోని క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం అయినందున 24 గంటల్లో కూల్చేస్తామని పేర్కొంటూ గురువారం సాయంత్రం గంటాకు నోటీసులు జారీచేశారు. అయితే భవనం క్రమబద్ధీకరణకు à°¦ రఖాస్తు చేసుకున్నప్పటికీ రాజకీయ కక్షతోనే దానిని తిరస్కరించి, భవనం కూల్చివేయాలనే నిర్ణయానికి వచ్చారని à°—à°‚à°Ÿà°¾ ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని భీమిలిలో à°—à°² టౌన్‌ సర్వేనంబర్‌ 442లో à°—à°‚à°Ÿà°¾ కుమార్తె à°—à°‚à°Ÿà°¾ సాయిపూజిత పేరుతో నిర్మించిన జి+2 భవనాన్ని ఆయన క్యాంప్‌ కార్యాలయంగా వాడుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో à°† భవనానికి ఎలాంటి ప్లాన్‌ లేనందున చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. దీనిని తీసుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం గోడకు అతికించారు. తర్వాత à°—à°‚à°Ÿà°¾ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు.
 
దీనిపై కోర్టు ఇటీవల జీవీఎంసీ అధికారుల వివరణ కోరగా...అక్రమ భవన నిర్మాణం కావడంతో చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భవనం కూల్చేముందు యజమానికి వారం రోజులు ముందు సమాచారం ఇవ్వాలని సూచించింది. అందులో వున్న ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించింది. à°ˆ క్రమంలో జీవీఎంసీ అధికారులు భవనాన్ని 24 గంటల్లో కూల్చివేస్తున్నట్టు పేర్కొంటూ గురువారం నోటీసులు తయారుచేసి గంటాకు అందజేశారు. బీపీఎ్‌సలో భవనం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాజకీయ కక్షతోనే తన భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారని à°—à°‚à°Ÿà°¾ ఆరోపించారు. ఒకవేళ భవనాన్ని కూల్చివేయాలనుకుంటే ఐదు రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని కోర్టు సూచించినా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జీవీఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ ఆర్జే విద్యుల్లత స్పందిస్తూ.. అలాంటి ఉత్తర్వులు తమకు అందలేదని చెప్పారు.