బీజేపీలో చేరిన కరణం రెడ్డి నరసింగరావు

Published: Thursday September 19, 2019
 à°¦à±‡à°¶à°¾à°¨à±à°¨à°¿ సమర్థవంతంగా పాలించే సత్తా బీజేపీకి సాధ్యమని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు, గాజువాక 61à°µ వార్డు పరిధిలోని శ్రీ కృష్ణదేవరాయ కల్యాణమండపంలోబుధవారం జరిగిన బీజేపీ సమావేశానికి కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. సామాజిక కార్యకర్త, కెఎన్ఆర్  కన్స్ట్రక్షన్స్ అధినేత, స్వచ్చంద సేవలు చేస్తున్న à°¡à°¾. కరణంరెడ్డి నర్సింగరావును కన్నా లక్ష్మీనారాయణ కండువా కప్పి బీజేపీ లోకి ఆహ్వానించారు . à°ˆ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలఆకాంక్షలు, సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న సేవలు మరువరానివన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ప్రజలంతా బీజేపీ వెంటే వున్నారన్నారు. సమాజసేవలో ముందుంటూ తాను చేపడుతున్న కార్యక్రమలు ద్వారా స్థానిక ప్రజలు మనస్సులో మంచి పేరు సంపాదించుకున్న à°¡à°¾ కరణంరెడ్డి నర్సింగరావు బీజేపీ లోకి రావడం గాజువాక ప్రాంతంలో పార్టీ బలోపేతానికి మరింత దోహదపడుతుందన్నారు. నిస్వార్థంతో సమాజానికి సేవ చేసే నర్సింగరావు వంటి వ్యక్తులను భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు.అనంతరం బీజేపీ సభ్యత్వం తీసుకున్న à°¡à°¾. కరణంరెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఆకర్షితుడిని తాను బీజేపీ చేరానన్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర స్థానిక బీజేపీ నాయకత్వ సలహాలు తీసుకుంటూ.. ప్రజల మనస్సులలో మరింతగా పార్టీ నిలబడే విధంగా పాటుపడతానన్నారు. ఈసమావేశంలో విశాఖ మాజీ ఎంపికెహరిబాబు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పివి చలపతిరావు, ఎంఎల్సి పివి ఎన్ మాధవ్, విశాఖ నగర బీజేపీ అధ్యక్షులు à°Žà°‚ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు