బ్రేక్‌లుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు.. యాక్సలరేటర్లుగా పనిచేశాయి

Published: Saturday September 21, 2019
చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగే క్రమంలో నియంత్రణ కోల్పోయి.. ఒరిగిపోయిన చంద్రయాన్‌-2 ల్యాండర్‌ ‘విక్రమ్‌’పై శాస్త్రవేత్తలు విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. విక్రమ్‌లోని ఆటోమెటిక్‌ ల్యాండింగ్‌ ప్రోగ్రామ్‌(ఏఎల్‌పీ) విఫలం కావడంతో బ్రేక్‌లుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు యాక్సెలరేటర్లుగా పనిచేసి ఒక్కసారిగా వేగాన్ని పెంచి ఉండొచ్చని ఇస్రోవర్గాలు చెబుతున్నాయి. ఇందువల్లే గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్‌ ఢీకొని ఉండొచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని à°“ శాస్త్రవేత్త చెప్పారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రముడితో అనుసంధానం తెగిపోయిందని ఇస్రో ప్రకటించినా.. ఇంచుమించు 330 మీటర్ల దూరంలో ఉండగా à°ˆ ఘటన జరిగిందన్నారు.
 
 
ఏఎల్‌పీ సిద్ధం చేసిన నిపుణుల బృందం ప్రయోగానికి ముం దు ప్రోగ్రామ్‌ను పునస్సమీక్షించుకొని ఉంటే ఇలా జరిగేది కాదని ఇంకొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం. à°ˆ నేపథ్యంలో ల్యాండర్‌ ‘విక్రమ్‌’ జాడను సూచించే పలు దృశ్యాలను నాసా శుక్రవారం విడుదల చేసింది. వీటిని తమ రోబోటిక్‌ అంతరిక్ష వాహనం లూన్‌ రీకనైజాన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌వో) చిత్రీకరించిందని తెలిపింది. అయితే à°† చిత్రాల్లో à°šà°‚ ద్రుడి ఉపరితలం చీకటిగా కనిపిస్తుండటంతో ల్యాండర్‌ నిర్దిష్ట ల్యాండింగ్‌ ప్రదేశాన్ని కనుగొనడం పెనుసవాలుగా మారింది. చంద్రుడిపై ‘విక్రమ్‌’ ల్యాండర్‌ జీవితకాలం 14 రోజులే. 7à°¨ క్రాష్‌ ల్యాండింగ్‌ జరిగినందున శనివారంతో దాని జీవితకాలం ముగియనుంది