బోటు ప్రమాద బాధితులకు రూ.1.20 కోట్లు

Published: Saturday October 26, 2019
గోదావరి నదిపై కచ్చులూరు వద్ద బోటు మునిగి మృతిచెందిన 12మంది బాధితుల కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన 12మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు అనుమతి ఇచ్చింది. à°ˆ మేరకు మొత్తం రూ.1.20కోట్లు విడుదల చేసింది. బోటు ప్రమాదంలో మరణించిన భాస్కి రాజేందర్‌, బాస్కి అవినాశ్‌, బాస్కి రాజేంద్రప్రసాద్‌, గోరె రాజేంద్రప్రసాద్‌, బాస్కి వెంకటయ్య, దోమల హేమంత్‌, భాస్కి ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరు రాజ్‌కుమార్‌, రేపాకుల విష్ణుకుమార్‌, గడ్డమీది సునీల్‌, ఎరాన్‌ సాయికుమార్‌à°² కుటుంబీలకు పరిహారం చెక్కులు అందించచనున్నారు. ఇందులో 9మంది వరంగల్‌ జిల్లా, ఖమ్మం, జనగాం, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరున్నారు.