ఇంటి వద్దకే పోస్టల్‌ బ్యాంక్‌ సేవలు!

Published: Sunday November 03, 2019

భారతీయ పోస్టల్‌శాఖ దేశ వ్యాప్తంగా ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలను అమలులోకి తెచ్చింది. బెంగళూరు జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీఓ) చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ కె.రాధా కృష్ణ à°ˆ మేరకు నగరంలో à°’à°• ప్రకటన విడుదల చేశారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, నగదు డ్రా చేసేందుకు ఇకపై ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. పోస్టల్‌శాఖ ప్రారంభించిన à°ˆ ప్రత్యేక పోస్టల్‌ బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు. à°ˆ ఖాతాలలో పొదుపు చేసిన మొత్తాలకు వందశాతం సురక్షిత ఉంటుందని రాధాకృష్ణ వెల్లడించారు. à°ˆ ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్‌ ఖాతాలుగా ఉంటాయన్నారు. పోస్టల్‌ సిబ్బందికి ఆర్‌ఐసిటి డివైజ్‌ యంత్రాలను ఇవ్వడం జరుగుతుందని వీటి ద్వారా పోస్టల్‌ శాఖకు సంబంధించిన పొదుపు ఖాతాలను, రికరింగ్‌ డిపాజిట్‌లను చేసుకోవచ్చునన్నారు. పోస్టల్‌ సిబ్బందికి à°’à°• మొబైల్‌ కూడా ఇస్తున్నామని సంతకం ద్వారా ఖాతా వివరాలను అత్యంత సులభంగా నిర్వహించే వెసలుబాటు కల్పిస్తున్నామన్నారు. బెంగళూరు ఎంపీలు à°¡à°¿.వి.సదానందగౌడ, తేజస్వి సూర్య, పి.సి.మో హన్‌లు ఇప్పటికే పోస్టల్‌బ్యాంకు ఖాతాలు ప్రారంభించారన్నారు. à°ˆ పథకంపై ప్రజలలో విస్తారంగా జాగృతి చేపట్టనున్నట్టు ఆయన వివరించారు.