’ను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లా!

Published: Tuesday December 10, 2019
‘దిశ’ను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లా!? à°ˆ కేసు విచారణలో జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం పాటించాల్సిన నిబంధనలను పాటించకుండానే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారా!? à°ˆ అంశాలకు సంబంధించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ మినహా మిగిలిన ముగ్గురు నిందితుల వయసు దాదాపు 20 సంవత్సరాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కానీ, నిందితుల్లో చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ మైనర్లని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తోంది. తమ బిడ్డలు మైనర్లని వారి కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్సీకి స్పష్టం చేసినట్లు తెలిసింది. à°ˆ మేరకు, వారి వయసు ధ్రువీకరణకు సంబంధించిన బోనఫైడ్‌ సర్టిఫికెట్లను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది.
 
 
శివ, చెన్నకేశవులుకు 18 ఏళ్లలోపే ఉన్నట్లు వారి బోనఫైడ్‌ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. à°† పాఠశాల జారీ చేసిన బోనఫైడ్‌ సర్టిఫికెట్ల ప్రకారం.. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు కాగా, చెన్నకేశవులు వయసు 15ఏళ్ల 7 నెలల 26 రోజులుగా ఉంది. వీరిలో చెన్నకేశవులు 2014 జూలై నుంచి 2015 ఏప్రిల్‌ వరకు ఆరో తరగతి చదివాడని బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. అతని పుట్టిన తేదీని 10.4.2004à°—à°¾ పేర్కొన్నారు. చెన్నకేశవులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాని చికిత్స నిమిత్తం 2018 సెప్టెంబరు 18నే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నకేశవులకు ఇప్పటికే పెళ్లయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. మరొక నిందితుడు జొల్లు శివ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో అతను 2002 ఆగస్టు 15à°¨ జన్మించినట్లు పేర్కొన్నారు. అయితే, à°ˆ సర్టిఫికెట్‌ను అతని తల్లిదండ్రులు సోమవారమే తీసుకున్నారు.