రాజధాని గ్రామాల్లో మంగళవారం పవన్ పర్యటన

Published: Monday December 30, 2019

రాజధాని గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. రైతులు, ప్రజలను కలిసి మాట్లాడనున్నారు. ఈ సందర్బంగా సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 13 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా గత 13 రోజులుగా రాజధాని గ్రామాల్లో రైతులు మూడురాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించేందుకు మంగళవారం పవన్ ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు.