పీఓకే మనదే... ఆర్మీ చీఫ్

Published: Saturday January 11, 2020
పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)పై కొత్త ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే స్పష్టమైన ప్రకటన చేశారు. పీఓకే మనదేనని, ఆపరేషన్ పీఓకే నిర్వహించేందుకు తాము సిద్ధమేనని కొత్త ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే అన్నారు. నెలవారీ ప్రెస్‌మీట్‌లో భాగంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరవనే మాట్లాడుతూ, పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంటు కోరితే, à°† ప్రాంతం కూడా మనదే అవుతుందన్నారు. à°† మేరకు తమకు ఎప్పుడు ఉత్తర్వులు అందితే అప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
 
 
ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఆర్మీ చీఫ్ ప్రస్తావిస్తూ, ఎల్ఓసీ వెంబడి అత్యంత అప్రమత్తత పాటిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఇంటెలిజెన్స్ అలెర్ట్‌లు అందుతుంటాయని, చాలా సీరియస్‌గానే వీటిని పరిగణించి పాకిస్థాన్ ప్రత్యేక బలగాలైన 'బ్యాట్' చర్యలకు ప్రతిచర్యలు చేపడుతూ వాటిని సమర్ధవంతంగా తిప్పికొడుతుంటామని చెప్పారు. 
 
పాక్, పాకిస్థాన్ సరిహద్దుల్లో బలగాల à°°à±€-బ్యాలెన్స్‌పై మాట్లాడుతూ, తూర్పు, పశ్చిమ సరిహద్దులు రెండింటికీ సమప్రాధాన్యం ఉన్నందున à°°à±€-బ్యాలెన్సింగ్ అనేది అవసరమేనని అన్నారు. భారత ఆర్మీ ప్రాధాన్యతలపై మాట్లాడుతూ, చొరబాట్లను తిప్పికొట్టడం తాత్కాలిక ప్రాధాన్యతాంశమైతే, సాంప్రదాయ యుద్ధం అనేది దీర్ధకాలిక ప్రాధాన్యతాంశం అవుతుందని, అందుకు తాము సన్నద్ధంగా ఉంటామని చెప్పారు. ఇండియా, చైనాల మధ్య ప్రతిపాదిత హాట్‌లైన్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ, త్వరలోనే ఇండియన్ డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌కు, చైనా వెస్ట్రన్ కమాండ్‌కు మధ్య హాట్‌లైన్ ఏర్పాటు జరుగుతుందన్నారు.