కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్‌న్యూస్

Published: Monday January 13, 2020
కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. టారిఫ్ ఆర్డర్‌కు ట్రాయ్ చేసిన తాజా సవరణలు వినియోగదారులకు మేలు చేసేవిగా ఉండటం విశేషం. రూ.130కే ఫ్రీ టూ ఎయిర్‌ చానెల్స్‌ ఇవ్వాలని ట్రాయ్ నిర్ణయించింది. బొకే చానెల్స్‌లో à°’à°• చానెల్‌ ఖరీదు రూ.12కు మించకూడదని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ à°ˆ ధర 19 రూపాయలుగా ఉండేది. ఇదిలా ఉండగా... ప్లేస్‌మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ట్రాయ్ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు.
 
à°’à°• ఇంట్లో à°’à°•à°Ÿà°¿ కంటే ఎక్కువ ఉంటే 40 శాతం వసూలు చేయాలని కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్‌ సూచించింది. ట్రాయ్ చేసిన à°ˆ సవరణల ప్రకారం 130 రూపాయలకే దాదాపు 200 ఛానల్స్‌ను వీక్షించే అవకాశం ఉంది. అంతేకాదు, మెజార్టీ ప్రజలు వీక్షించే స్పోర్ట్స్ ఛానల్స్ ధరలు కూడా ఒక్కో ఛానల్‌కు 12 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం మీద.. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయంతో కేబుల్ బిల్లు భారంగా మారిందని భావించిన వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.