అప్పట్లో మేమిద్దరం స్కూటర్‌పై తిరిగేవాళ్లం

Published: Monday January 20, 2020
బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నడ్డా తనకు పాత స్నేహితుడని, తాను పార్టీ బాధ్యతలు చూసే సమయంలో నడ్డా యువమోర్చా బాధ్యతలు చూసేవారని పేర్కొన్నారు. తామిద్దరమూ కలిసి స్కూటర్‌పై తిరిగేవారిమని, హిమాచల్ ప్రదేశ్‌లో నడ్డాతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తానని మోదీ ప్రకటించారు.
 
 
ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతారని ప్రశంసించారు. ఆయన సామర్థ్యాలకు తగినట్లుగానే బాధ్యతలను భుజాన వేసుకుంటారని, ఆయన చాలా బాగా పనిచేయడం తాను చూశానని మోదీ పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్తనూ గుర్తుపట్టడమే నడ్డా ప్రత్యేకత అని మోదీ కొనియాడారు.ఐదేళ్లూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾ అత్యుత్తమ కార్యకర్త అని, ఆయన పార్టీకి చేసిన సేవ వెలకట్టలేనిదని కొనియాడారు.
 
తామేం తప్పుడు విధానాలను అవలంబించలేదని, అందుకే ప్రజలు తమను ఆశీర్వదిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అలా ఆశీర్వదించడమే తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే వారికి తప్పులా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు వ్యతిరేకించిన ఆ వ్యక్తుల వద్ద ఆయుధాలేమీ లేవని, కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే వారి ఆయుధమని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.