ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత

Published: Wednesday January 22, 2020
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా ఆయన భేటీ అవుతారని సమాచారం. పర్యటన ముగిసే లోపు ప్రధాని మోదీని పవన్ కలవనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. à°ˆ చర్చల్లో రాజధాని అంశం ప్రముఖంగా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం.
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ పాల్గొంటారని తెలిసింది. ఇక నుంచి ఆంధ్రకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు పవన్‌ను సంప్రదించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాగా.. రాజధాని అంశంపై జాతీయ స్థాయిలో తీసుకోవలసిన చర్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం కన్నా, రావెల కిశోర్‌బాబు తదితర నేతలు చర్చలు జరిపారు.