కరోనా వైరస్‌పై ఏపీ మంత్రి సమీక్ష

Published: Tuesday January 28, 2020
 à°•à°°à±‹à°¨à°¾ వైరస్‌పై ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.
 
కరోనా వైరస్‌పై ప్రజలెవ్వరూ భయం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 5 పడకలతో కూడిన ప్రత్యేకవార్డు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వెంటిలేటర్లు కూడా ప్రతి ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా వైరస్‌పై తక్షణం à°’à°• ప్రత్యేక నోడల్ అధికారి నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ నిరంతరం పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి నాని ఆదేశించారు.