ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులు చేస్తున్న వైసీపీ

Published: Thursday February 20, 2020

‘‘పాలనకు పనికిరాని అసమర్థుడు  జగన్మోహన్‌రెడ్డి. తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. అరాచకాలు, అక్రమాలతోనే వైసీపీ ఆవిర్భవించింది. రాష్ట్రం సీఎం సొంత జాగీరు కాదు. ఆడింది ఆట, పాడింది పాటలా పాలన సాగిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ బుధవారం కడపలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 

 

 à°ˆ సందర్భంగా కన్నా మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసేలా బీజేపీ కార్యకర్తలు, నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్నారు. కడపలో తమ పార్టీ అధికార ప్రతినిధి బండి ప్రభాకర్‌పై అక్రమ కేసులు బనాయించారన్నారు. à°ˆ కేసును బేషరతుగా ఎత్తివేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి, మాజీ మంత్రులు రావెల కిశోర్‌బాబు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.