కరోనా మరణాల కలకలం..

Published: Wednesday June 10, 2020

తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. బుధవారం ఒక్కరోజే 1,927 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాదు, తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఒక్కరోజే 19 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 326కు చేరింది.

 

తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,841à°•à°¿ చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 17,179. ఇప్పటివరకూ 19,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడులో ఇప్పటివరకూ 6,09,856 మందికి టెస్ట్‌లు నిర్వహించారు. బుధవారం ఒక్కరోజే 16,667 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.