టీటీడీ పవిత్రతను మంట గలిపేలా అన్యమత ప్రచారం

Published: Monday July 06, 2020

టీటీడీ మాసపత్రిక ‘సప్తగిరి’ వేయించుకుంటే దాంతో పాటు ‘సజీవసువార్త’ అనే మాస పత్రికను టీటీడీ పోస్టు ద్వారా పంపింది. à°ˆ ఘటన గుంటూరులో జరిగింది. టీటీడీ మాస పత్రికతో పాటు అన్యమత పత్రికను పంపడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను మంటగలిపేలా à°ˆ వ్యవహారం ఉందంటున్నారు. టీటీడీకి హైందవ దాతలు ఇచ్చే డొనేషన్స్ అన్యమత ప్రచారం కోసం వాడుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో à°“ వ్యక్తికి ‘సప్తగిరి’ అనే మాసపత్రిక వేయించుకుంటే ‘సజీవసువార్త’ అనే ఇంకొక పత్రిక కూడా రావడంతో కలకలం రేగింది.

 

కాగా తిరుమల తిరుపతి సిబ్బంది మరొక అపచారానికి పాల్పడ్డారు. ఘోరమైన తప్పిదం జరిగింది. గుంటూరు నగరంలో వెలుగు చూసింది. మాసపత్రికను చూస్తే టీటీడీ పని తీరు అర్ధమవుతోంది. సంవత్సరం చందా కట్టిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా ‘సప్తగిరి’ మాసపత్రికను పంపుతూ ఉంటుంది. అయితే గుంటూరు నగరంలోని మల్లిఖార్జునరావు పేటకు చెందిన భక్తుడికి à°ˆ నెల ‘సప్తగిరి’ మాస పత్రిక వచ్చింది. పార్శిల్ తీసి చూడగా ‘సప్తగిరి’ మాసపత్రికతో పాటు à°“ మతానికి సంబంధించిన ‘సజీవసువార్త’ అనే మరొక మాసపత్రిక పార్శిల్ వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా టీటీడీ కొత్తగా అన్యమత ప్రచారం చేయడంపై భక్తుడు అవాక్కయ్యాడు.