డార్క్ వెబ్‌లో... 14.2 కోట్ల మంది డేటా...

Published: Wednesday July 15, 2020

సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చిందో... అదే స్థాయిలో ప్రమాదాలనూ తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలోనే... ఎవరి వ్యక్తిగత సమాచారానికి కూడా రక్షణ లేకుండా పోతోంది. వివిధ మార్గాల ద్వారా కోట్లాది మంది డేటాను కొల్లగొడుతోన్న హ్యాకర్లు... వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.

 

తాజాగా డార్క్‌వెబ్ ద్వారా 14.2 కోట్ల మంది డేటా అమ్మకానికి పెట్టారు హ్యాకర్లు.అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్న ఎంజీఎం రిసార్ట్స్ హోటల్స్‌లో బస చేసిన వారి డేటాను మన కరెన్సీలో రూ. 2.18 లక్షలకు అమ్మకానికి పెట్టారు. డేటా హ్యాకింగ్‌కు సంబంధించిన సమాచారం à°ˆ ఏడాది ఫిబ్రవరిలోనే బయటకు వచ్చింది. 2019 లో కేసినో కేపిటల్ లాస్‌వెగాస్ లో బస చేసిన వారిలో సెలబ్రిటీలు, టెక్ సీఈవోలు, టెక్ ఉద్యోగులు, పాత్రికేయులు, ప్రభుత్వాధికారులు ఉన్నారు.

 

ఇక... హ్యాక్ అయిన డేటాలో ఆయా వ్యక్తుల పూర్తి పేర్లు, ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఈ మెయిళ్ళు, పుట్టిన తేదీలు తదితర వివరాలున్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న డేటాలో... ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ, పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వంటి ప్రముఖుల డేటాలు కూడా ఉన్నాయి.