ప్లాస్మాను ఎవరు దానం చేయొచ్చు?

Published: Saturday July 18, 2020

ప్లాస్మాథెరపీతో తక్కువ ఖర్చుతో వైద్యం చేయొచ్చని.. కాబట్టి, ఇప్పటికే కరోనాను జయించినవారు ప్లాస్మా దానం చేయాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. కానీ.. కరోనాపై పోరులో భాగంగా మన రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు ఎక్కువకాలం ఉండవని, వైరస్‌ బారిన పడి కోలుకున్న కొన్ని నెలల తర్వాత తగినన్ని యాంటీబాడీలు శరీరంలో ఉండట్లేదని లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది! దీంతో, సాధారణ జలుబులాగానే కొవిడ్‌-19 కూడా మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. à°ˆ చికిత్సకు అవసరమైన ప్లాస్మాను ఇటీవలికాలంలో వైరస్‌ బారిన పడి కోలుకున్నవారి నుంచే సేకరించాలని అప్పుడే ఉపయోగం ఉంటుందని నార్వే, ఎస్తోనియా శాస్త్రజ్ఞుల అధ్యయనంలో కూడా తేలింది. à°† అధ్యయన ఫలితాలను ‘వైరసెస్‌’ జర్నల్‌లో ప్రచురించారు. à°ˆ అధ్యయనంలో భాగంగా శాస్త్రజ్ఞులు కొవిడ్‌-19 సెల్‌ కల్చర్స్‌కు.. వైరస్‌ బారిన పడి కోలుకున్న పలువురి నుంచి సేకరించిన ప్లాస్మాను జోడించారు. వెంటనే à°† ప్లాస్మాలోని యాంటీబాడీలు వైర్‌సను నిర్వీర్యం చేయడం ప్రారంభించాయి. అయితే.. వైర్‌సను జయించి ఎక్కువ కాలం అయినవారి నుంచి సేకరించిన ప్లాస్మాలోని యాంటీబాడీల కన్నా, ఇటీవలే వైరస్‌ బారిన పడి కోలుకున్నవారి ప్లాస్మాలోని యాంటీబాడీలు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న రెండునెలల తర్వాత సేకరించే ప్లాస్మాలో.. కరోనాతో యుద్ధం చేసేందుకు కావాల్సినన్ని యాంటీబాడీలు లేవని తేలింది. అందుకే వైద్యులు, ఆస్పత్రులు à°ˆ విషయాన్ని గుర్తుంచుకోవాలని పరిశోధకులు సూచించారు.

 

రక్తదానానికి వర్తించే షరతులే దీనికీ వర్తిస్తాయి. 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్నవారు, 50 కిలోలకు పైగా బరువున్న కరోనా విజేతలే ప్లాస్మాదానానికి అర్హులు. అది కూడా.. వైరస్‌ నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతే ప్లాస్మాను దానం చేయాలి. ప్రస్తుతం తాము దాతల నుంచి 28 రోజుల తర్వాతే ప్లాస్మాను సేకరిస్తున్నామని కిమ్స్‌ ఆస్పత్రికి చెందిన రుమటాలజిస్టు డాక్టర్‌ శరత్‌ చంద్రమౌళి తెలిపారు. 14 రోజుల తర్వాత కూడా ప్లాస్మాను సేకరించవచ్చుగానీ.. అలా సేకరించడానికి ముందు వారికి మరోసారి కొవిడ్‌-19 టెస్టు చేసి, అందులో కూడా నెగెటివ్‌ వస్తేనే వారి నుంచి ప్లాస్మా తీసుకుంటామని ఆయన వివరించారు.