కరోనాతో మరణిస్తే కోటి ఎక్స్‌గ్రేషియో

Published: Thursday July 23, 2020

కరోనా వైరస్‌తో మరణించిన à°“ పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. à°† కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. అంతే కాకుండా కరోనా వారియర్లు ఎవరైనా కోవిడ్-19 వల్ల మరణించినా వారందరి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో అందించనున్నట్లు స్పష్టం చేశారు. à°ˆ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

 

‘‘అమిత్ జీ తన జీవితాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. కానీ దురృష్టవశాత్తూ అతడు కరోనా బారిన పడి మరణించాడు. ఢిల్లీ ప్రజలందరి తరపున ఆయన చేసిన త్యాగానికి నేను నివాళులర్పిస్తున్నాను. అంతే కాకుండా అతడి కుటుంబానికి à°’à°• కోటి రూపాయల ఎక్స్-గ్రేటియా ఇస్తామని ప్రకటిస్తున్నాం’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఫ్రంట్‌లైన్ కోవిడ్19 వారియర్స్ అందరికీ à°ˆ ఎక్స్‌గ్రేషియో వర్తిస్తుందని ఢిల్లీ సీఎంవో పేర్కొంది.