హానికారక బ్యాక్టీరియాల అభివృద్ధికి పాక్‌లో రహస్య ప్రాజెక్టు

Published: Monday July 27, 2020

జీవాయుధాల తయారీకి పాకిస్థాన్‌, చైనా జట్టు కట్టాయా ? కరోనా, ఆంథ్రాక్స్‌ తరహా అత్యంత ప్రమాదకర వైర్‌సలు, బ్యాక్టీరియాల అభివృద్ధికి రహస్య ప్రాజెక్టు నడుపుతున్నాయా ? ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పరిశోధక వార్తాపత్రిక ‘à°¦ క్లాక్సన్‌’ à°ˆ ప్రశ్నలకు ఔననే సమాధానమే చెబుతోంది. ఈమేరకు వివరాలతో జూలై 23à°¨ à°† పత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం కలకలం రేపుతోంది. కరోనా పుట్టినిల్లుగా అపఖ్యాతిని మూటకట్టుకున్న చైనాలోని ‘వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’.. పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన ‘డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌’(డీఈఎ్‌సటీఓ)à°² మధ్య జీవాయుధాల అభివృద్ధికి ఒప్పందం కుదిరిందని à°† కథనంలో ప్రస్తావించారు.

 

ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌ ల్యాబ్‌లో ఆంథ్రాక్స్‌ తరహా మహమ్మారి బ్యాక్టీరియాల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులు, సాంకేతిక వనరులను చైనాయే సమకూరుస్తోందన్నారు. తొలి విడతగా మట్టి నమూనాలకు పరీక్షలు నిర్వహించి, వాటి నుంచి బసిల్లస్‌ థురింగైన్సిస్‌ (బీటీ) బ్యాక్టీరియాను వేరుచేశారని.. దానికి ఆంథ్రాక్స్‌ (బసిల్లస్‌ ఆంథ్రసిస్‌) బ్యాక్టీరియాతో దగ్గరి పోలికలు ఉన్నాయని ‘క్లాక్సన్‌’ తెలిపింది. జీవాయుధాల ఉత్పత్తికి ‘బసిల్లస్‌ థురింగైన్సి్‌à°¸’ను కీలక మాధ్యమంగా వినియోగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 

 

వర్సిటీలు, ఆరోగ్య విభాగాలకు సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా ‘డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌’ ల్యాబ్‌కు పాకిస్థాన్‌ స్వయంప్రతిపత్తిని కల్పించడం అనుమానాలకు తావిస్తోందని ‘క్లాక్సన్‌’ వివరించింది. కరోనా వ్యాప్తిపై అపఖ్యాతిని మూటకట్టుకున్న చైనా.. జీవాయుధాల తయారీ వంటి మానవ వినాశకర ప్రాజెక్టులను ప్రస్తుతానికి పాక్‌కు తరలించి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చైనా-పాక్‌లు సంయుక్తంగా క్రిమియన్‌ కాంగో హెమరేజిక్‌ ఫీవర్‌ వైరస్‌ను జీవాయుధంగా మలిచేందుకు ప్రయోగాలు జరిపాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ‘క్లాక్సన్‌’ పేర్కొనడం గమనార్హం. కాగా, à°ˆ కథనాన్ని పాక్‌ విదేశాంగ శాఖ ఖండించింది.