స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం... కీలక ఆధారాలు సేకరణ!

Published: Wednesday August 12, 2020

 à°¸à±à°µà°°à±à°£ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై నాలుగో రోజు దర్యాప్తు కొనసాగుతోంది. అగ్నిప్రమాద స్థలాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌, విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించారు. à°ˆ దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ కమిటీ సభ్యుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. స్వర్ణ ప్యాలెస్‌ భవనంలో కేబుల్స్‌ను విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలించారు. ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్‌ యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీమ్ ఉంది. దాదాపు మూడు గంటలు పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ కమిటీ దర్యాప్తు చేసింది. ప్రధానంగా ఆస్పత్రి నిర్లక్ష్యం కారణమేనని ప్రాధమికంగా కమిటీ నిర్ధారించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన విద్యుత్ షాట్ సర్క్యూట్‌పై కమిటీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. పూర్తిగా సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అధికారులు తీసుకెళ్లారు. 

 

విజయవాడలోని స్వర్ణాప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన à°ˆ ఘోర అగ్ని ప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా, అందులో మనజిల్లావారు ఏడుగురు ఉన్నారు. 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మాడి మసైపోయిన మృతదేహాలను చూసి ‘ఇదేం ఘోరం దేవుడా..’ అని బంధువులు గుండెలవిసేలా రోదిస్తే.. అసలే కరోనాతో కకావికలం అవుతున్న విజయవాడ à°ˆ విస్ఫోటనానికి విలవిల్లాడిపోయింది. అయితే à°ˆ ప్రమాదంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. శానిటైజేషన్‌ కారణంగా జరిగిందని వామపక్ష నేత పి.మధు చెప్పారు. హోటల్‌లోని ఫ్రంట్‌ ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది ల్యాప్‌టాప్‌ కాలిపోవడంతో ప్రమాదం సంభవించిందన్నది మరో వాదన. ఫ్రంట్‌ ఆఫీస్‌ వెనుక వైపున ఉన్న సర్వర్‌ రూమ్‌ నుంచి పొగలు వ్యాపించాయని కొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా పది ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయి. మంటలు, పొగ కింది నుంచి పైకి వ్యాపించడంతో మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్న వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.