జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన రైతులు

Published: Sunday August 23, 2020

 à°µà±†à°²à°—పూడిలో రాజధాని అమరావతి జేఏసీ కార్యాలయాన్ని రైతులు నేడు ప్రారంభించారు. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా రైతు కంభంపాటి శిరీష రిబ్బన్ కట్ చేసి జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నేతలు సంయుక్తంగా జేఏసీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. à°ˆ క్రమంలో తమ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేసేందుకు జేఏసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.