ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

Published: Friday September 04, 2020

 à°à°ªà±€à°²à±‹ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు కరోనా మరణాలు కూడా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 10,776 కరోనా కేసులు నమోదయ్యాయి. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4,76,506కు కరోనా కేసులు చేరాయి. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో కరోనాతో 76 మంది మృతి చెందారు. ఇప్పటికే వరకు కరోనాతో 4,276 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 3,70,163 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 39.65 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. 

 

 

రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నమోదయిన మరణాలు ఇలా ఉన్నాయి... చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనాతో 9 మంది చొప్పన మృతి చెందారు. గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, పశ్చిమగోదావరి 6, విశాఖ 6, తూర్పుగోదావరిలో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలో ఇద్దరు మృతి చెందారు.