ఏపీలో 9,901 కరోనా కేసులు

Published: Saturday September 12, 2020

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో కొవిడ్‌ కేసులు విలయతాండవం చేస్తున్నాయి. ఆగకుండా వేల సంఖ్యలో నిత్యం పరుగులు తీస్తూనే ఉన్నాయి. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 9,901 కరోనా కేసులు నమోదయ్యాయి. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 5,57,587à°•à°¿ కరోనా కేసులు చేరాయి. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో కరోనాతో 67 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,846 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 95,733 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా జయించి 4,57,008 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 45.27 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. 

 

 

మరణాల వివరాలు ఇలా ఉన్నాయి... కడప 9, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి మృతి చెందారు. నెల్లూరు 7, గుంటూరు 6, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో 4, అనంతపురం 3, తూర్పుగోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.