చైనాతో సరిహద్దు ఘర్షణల భారత సైన్యం సన్నద్ధం

Published: Wednesday September 16, 2020

చైనాతో సరిహద్దు ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే బోఫోర్స్ శతఘ్నులను భారత సైన్యం సన్నద్ధం చేస్తోంది. ఏ క్షణంలోనైనా లద్దాఖ్‌లో à°ˆ 155 à°Žà°‚à°Žà°‚ బోఫోర్స్‌ గన్‌లను రంగంలోకి దింపేందుకు చురుకుగా సన్నాహకాలు జరుగుతున్నాయి. లద్దాఖ్‌లోని బోఫోర్స్ గన్స్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్‌లో సర్వీసింగ్, మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నట్టు 'ఏఎన్ఐ' వార్తా కథనం పేర్కొంది.

బోఫోర్స్ శతఘ్నులను ఆర్టిలరీ రెజిమెంట్‌లో 1980à°µ దశకం మధ్యలో ప్రవేశపెట్టారు. అరివీర భయంకరంగా భూతలం, వాయుతలంపై కాల్పులతో మోతమోగించే సామర్థ్యం à°ˆ బోఫోర్స్ శతఘ్నులకు ఉంది. ప్రస్తుతం వీటి సర్వీసింగ్ పూర్తికాగానే  లద్దాఖ్‌లో మోహరించనున్నట్టు తెలుస్తోంది. బోఫోర్స్ శతఘ్నిని సర్వీసు చేస్తున్న ఆర్మీ ఇంజనీర్ ఒకరు దీనిపై మాట్లాడుతూ, కొద్దిరోజుల్లోనే బోఫోర్స్ గర్జించేందుకు సిద్ధమవుతుందని చెప్పారు.

అధికారుల కథనం ప్రకారం, బోఫోర్స్ శతఘ్నులకు పీరియాడికల్ సర్వీస్, మెయింటెన్స్ జరుగుతుండాలి. ఇందుకోసం టెక్నీషియన్లు ఉంటారు. à°ˆ ఆయుధ సామగ్రి సర్వీస్, మెయింటెనెన్స్ ‌వంటివి చూసుకోవడం ఆర్మీ ఇంజనీర్ల బాధ్యత. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని డ్రాస్‌లో జరిగిన ఆపరేషన్ విజయ్ సహా పలు యుద్ధాల్లో విజయానికి బోఫోర్స్ కీలక భూమిక వహించింది. పాకిస్థాన్‌పై 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో బోఫోర్స్ శతఘ్నులు పాక్ బలగాలను మట్టికరిపించాయి. ఎత్తైన కొండ ప్రాంతాల్లో పాక్ ఏర్పాటు చేసిన బంకర్లు, స్థావరాలను శతఘ్నులు సర్వనాశనం చేశాయి. పాక్‌కు భారీ నష్టాన్ని కలిగించి, భారత్ విజయాన్ని సుగమం చేశాయి.