కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు తీవ్ర ఘర్షణ

Published: Thursday October 01, 2020

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు గ్రేటర్ నోయిడా వద్ద తీవ్ర ఘర్షణ చెలరేగింది. à°ˆ ఘర్షణలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక బయల్దేరారు. వారిని పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్ వద్ద అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కార్యకర్తలతో కలిసి నడక ప్రారంభించారు. దీనిని అడ్డుకునే క్రమంలో రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.

 

 

à°ˆ క్రమంలో పోలీసులు రాహుల్‌ను కిందతోసేశారు. దీనిపై రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పోలీసులే నన్ను కిందకు తోసేశారు. నాపై లాఠీఛార్జ్ చేశారు. ఏం చట్టం à°•à°¿à°‚à°¦ అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రోడ్డుపై కేవలం మోదీయే నడవాలా? సామాన్యులు నడిచే హక్కు లేదా? మా వాహనాలను ఆపేశారు. అందుకే మేం నడక ప్రారంభించాం.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.