2న పోలవరంపై పీపీఏ అత్యవసర భేటీ

Published: Thursday October 29, 2020

కేంద్ర కేబినెట్‌ 2017 మార్చి 15à°¨ తీసుకున్న పోలవరం అంచనా విలువ రూ.20398.61 కోట్లే ప్రధాన అజెండాగా నవంబరు రెండో తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)  అత్యవసర సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే à°ˆ భేటీలో కేంద్ర జలసంఘం సభ్యుడు, జలశక్తి శాఖ కమిషనర్‌, జలసంఘం పీపీవో చీఫ్‌ ఇంజనీర్‌, రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు తదితరుల పాల్గొంటారు.

 

2017 మార్చి 15à°µ తేదీన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో 2013-14 అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా తీర్మానించారు. ఆనాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టుపై రూ.4,730.71 కోట్లు వ్యయం చేసింది. 2014 ఏప్రిల్‌ 1నాటికి ఉన్న ప్రాజెక్టు పనుల అంచనాను 2017-18 షెడ్యూల్డ్‌ స్టాండర్డ్‌ రేట్‌ (ఎస్‌ఎ్‌సఆర్‌) ప్రకారం రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించింది.

 

అనంతరం à°ˆ అంచనాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి.. రూ.47,725.74 కోట్లుగా జలశక్తి శాఖ తేల్చింది. ఇప్పుడు 2013-14 ధర రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఇందుకు 2017 మార్చి 15à°µ తేదీనాటి కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. వీటన్నిటిపైనా పీపీఏ అత్యవసర సమావేశంలో చర్చించనున్నారు.