కృష్ణాలో కరోనా అలజడి

Published: Saturday October 31, 2020

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో 84,401 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య  8,20,565à°•à°¿ పెరిగింది. తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 3,623 మంది కరోనా నుంచి బయటపడగా.. మొత్తం రికవరీలు 7,88,375à°•à°¿ చేరుకున్నాయి. ప్రస్తుతం 25,514 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు 24 గంటల్లో 17 మందిని కరోనా బలి తీసుకుంది. కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, à°•à°¡à°ª, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తం మరణాలు 6,676à°•à°¿ చేరుకున్నాయి. 

కృష్ణా జిల్లాలో à°—à°¤ 24 గంటల్లో 448 మందికి కరోనా సోకింది. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 38,899à°•à°¿, కరోనా మరణాలు 563à°•à°¿ పెరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 376 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 92,376à°•à°¿ చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 405 కేసులు నమోదయ్యాయి. à°’à°•à°°à°¿ మృతితో మరణాల సంఖ్య 610à°•à°¿ చేరింది. గుంటూరు జిల్లాలో మరో 385 కేసులు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలో మరో 296 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు 778 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా 80 కేసులు బయటపడగా.. కర్నూలు జిల్లాలో 36, à°•à°¡à°ª జిల్లాలో 148 మందికి వైరస్‌ సోకింది. అనంతపురం జిల్లాలో తాజాగా 151 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 64,436à°•à°¿ చేరింది. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 44,160కు చేరింది. విజయనగరం జిల్లాలో 69 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు 199 మంది మరణించారు.