తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు

Published: Monday November 02, 2020

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు ఫలించాయి. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఏపీలో 826 బస్సులను లక్షా 61 వేల 258 కిలోమీటర్ల మేర టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. తెలంగాణలో 638 బస్సులను లక్షా 60 వేల 999 కిలోమీటర్ల మేర ఏపీ ఆర్టీసీ నడపనుంది.

 

 

 

లాక్‌డౌన్ దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీలు నిలిచిపోయాయి. అనంతరం కరోనా ఉధృతి తగ్గినా, అన్‌లాక్ ప్రక్రియ నడిచినా బస్సు సర్వీసులు మాత్రం పునరుద్ధరించబడలేదు. పలుమార్లు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగినా ఫలించలేదు. ఎట్టకేలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీంతో నేటినుంచే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.