330 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

Published: Wednesday November 04, 2020

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటన విషయం విదితమే. అయితే à°ˆ పర్యటన పదే పది నిమిషాల్లో పూర్తయ్యింది. à°ˆ పర్యటనలో భాగంగా తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 330 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. à°ˆ శంకుస్థాపన కార్యక్రమం పది నిమిషాల్లోనే పూర్తయిపోయింది. à°ˆ కార్యక్రమంలో జగన్ మాట్లాడలేదు. అనంతరం ఏలూరు నగరంలోని శ్రీసూర్య కన్వెన్షన్‌ హాల్‌లో ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, నూర్జహాన్‌à°² కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. à°ˆ రెండు కార్యక్రమాలతో జగన్ ఏలూరు పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో ఏలూరు నుంచి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగుపయనమయ్యారు.

 

ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి.. 10:43 గంటలకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏలూరులో అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏలూరులో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మందిని మాత్రమే అనుమతించారు. ఈ పర్యటనలో జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఉన్నారు.