చైనాకు భారత్ ఝలక్..

Published: Tuesday November 24, 2020

చైనాకు భారత్ మళ్లీ ఝలక్ ఇచ్చింది. à°† దేశానికి చెందిన 43 అప్లికేషన్లను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బ్యాన్ చేసిన యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి. à°ˆ బ్యాన్ విధించడానికి à°—à°² కారణాలను కేంద్రం వెల్లడించింది. భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి à°­à°‚à°—à°‚ కలిగే అవకాశం ఉందని, అలాగే రక్షణరంగ, కేంద్ర-రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా à°ˆ అప్లికేషన్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది.

 

ఇప్పటికే చైనాకు చెందిన వందకు పైగా మొబైల్ అప్లికేషన్లను కేంద్ర సర్కార్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తొలిసారి యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ వంటి 59 యాప్స్‌పై కేంద్ర బ్యాన్ విధించింది. à°† తరువాత రెండో విడతగా పాపులర్ గేమ్ పబ్‌జీతో సహా మొత్తం 118 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఇక ఇప్పుడు అలీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో 43 యాప్స్‌ను బ్యాన్ చేయడంతో మొత్తం ఇండియా బ్యాన్ చేసిన చైనీస్ అప్లికేషన్ల సంఖ్య 200 దాటేసింది.