26/11 ఎన్నటికీ మరిచిపోం

Published: Thursday November 26, 2020

26/11 మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని, à°ˆ దాడిలో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. నేటి భారతం కొత్త పంథాతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా బలగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. 26/11 మారణహోమంలో అసువులు బాసిన వారికి ప్రధాని మెదీ à°ˆ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు.