ఏపీలోని అన్ని ప్రాజెక్ట్‌ల్ని పూర్తి చేస్తాo

Published: Thursday December 10, 2020

2024లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏపీలోని అన్ని ప్రాజెక్ట్‌ల్ని పూర్తి చేస్తామని à°† పార్టీ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. రూ. 40 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం జగన్‌ చెప్తున్నారని, ప్రాజెక్టులకు అన్ని వేల కోట్లు అవసరం లేదని తోసిపుచ్చారు. రూ.1,800 కోట్లతో కేంద్రం అమరావతిలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మించిందని తెలిపారు. రూ.7,200 కోట్లతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు అమరావతి నిర్మించలేక పోయారు? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. గురువారం జిల్లాలో సోము వీర్రాజు పర్యటించారు. ఉదయం 9 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో స్థానిక à°•à°¡à°ª - రాయచోటి రోడ్డులోని ఎంకే కల్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు