నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

Published: Thursday December 10, 2020

 ‘సెంట్రల్ విస్టా’ à°—à°¾ పిలిచే నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. శృంగేరీ శారదా పీఠం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. తర్వాత సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. అచ్చు రాజ్యాంగం రూపంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించి మోదీ అందరి దృష్టినీ ఆకర్షించారు. à°ˆ కార్యక్రమంలో స్పీకర్ à°“à°‚ బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌à°·à°¾, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పారిశ్రామికవేత్త రతన్ టాటా పాల్గొన్నారు.