నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు సంపన్నులవుతారు

Published: Saturday December 12, 2020

 à°•à±‡à°‚ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకు నూతన వ్యవసాయ మార్కెట్ల సృష్టి జరిగి, సాంకేతికంగా రైతులు పురోగతి సాధించే వీలుందన్నారు. ‘‘వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, నిల్వలు, శీతల గిడ్డంగులు తదితర రంగాల మధ్య కొన్ని గోడలున్నాయి. నూతన చట్టాలతో à°ˆ గోడలన్నీ బద్దలైపోతున్నాయి. దీని ద్వారా రైతులకు కొత్త కొత్త మార్కెట్లు ఉద్భవిస్తాయి. సాంకేతిక ప్రయోజనాలు ఒనగూరుతాయి. సాంకేతిక ప్రయోజనాలు నెరవేరుతాయి. వీటి ద్వారా కొత్త పెట్టుబడులకు మార్గాలు తెరుచుకుంటాయి. వీటి ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు.’’ అని మోదీ వివరించారు.

à°’à°• à°°à°‚à°—à°‚ పురోభివృద్ధి సాధించినపుడు à°† ప్రభావం ఇతర రంగాలపై కచ్చితంగా పడుతుందని ఆయన అన్నారు. పరిశ్రమల మధ్య అనవసరపు గోడలు నిర్మించినపుడు ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చని, వాటి ద్వారా జరగాల్సినంత అభివృద్ధి à°† పరిశ్రమలో జరగదని అన్నారు. ‘ఫిక్కీ’ 93 à°µ వార్షిక సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగం చేశారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లలో గానీ, బయట గానీ అమ్ముకునే స్వేచ్ఛ వారికి ఉందని, అంతేకాకుండా డిజిటల్ వేదికల ద్వారా కూడా వారి ఉత్పత్తులను అమ్ముకునే వీలుందని పేర్కొన్నారు.

 

ఇవన్నీ కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, వారిని సుసంపన్నులుగా చేస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. à°—à°¤ ఆరు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు భారత దేశంపై ఎనలేని విశ్వాసాన్ని చూపించాయని, à°† విశ్వాసం కొన్ని నెలల్లోనే మరింత రెట్టింపైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అది విదేశీ పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఎఫ్‌పీఐ లో గానీ... విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లో విశేషంగా పెట్టుబడులు పెట్టారని, à°† పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. భారత పరిశ్రమలకు గోడలు అవసరం లేదని, à°’à°• రంగంతో మరో రంగాన్ని కలిపే ‘వారధులు’ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.