ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా

Published: Monday December 14, 2020

 à°à°ªà±€à°²à±‹ కరోనా కేసులు తగ్గుముఖం పెడుతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 305 కరోనా కేసులు నమోదయ్యాయి. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,75,836 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,059 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 4,728 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,64,049 మంది రికవరీ అయ్యారు. à°ˆ రోజు నెల్లూరు జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 

 

తెలంగాణలో à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో 384 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,78,108కు చేరింది. 1,496 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,380 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,69,232 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి.