ప్రభుత్వ ప్రమేయంతోనే బ్యాంకుల దగ్గర చెత్త

Published: Saturday December 26, 2020

ప్రభుత్వ ప్రమేయంతోనే బ్యాంకుల దగ్గర చెత్త వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలపై దాడి ఘటనగా దీనిని కేంద్రం పరిగణిస్తుందన్నారు. హ్యాకర్స్ కోసం కేంద్ర స్వనిధి కార్యక్రమం చేపడితే... దాని పేరును జగనన్న తోడుగా మార్చారన్నారు. పథకాన్ని రూరల్‌లో అమలు చేయాలని బ్యాంకులపై ఒత్తిడి చేశారని సోమువీర్రాజు పేర్కొన్నారు.