కరోనా పురుషులనే టార్గెట్ చేస్తోందట!

Published: Thursday December 31, 2020

కరోనా వైరస్ ఫిమేలా? మగవాళ్లకే ఎక్కువ సోకుతుందా? దేశంలో ఇప్పటివరకు ఎంతమంది మగవాళ్లు చనిపోయారు? వారిలో ఎక్కువగా ఏ వయస్సువాళ్లు ఉన్నారు?  కొత్తరకం వైరస్ ఉధృతి దేశంలో ఎలా ఉంది? రికార్డులు ఏం చెబుతున్నాయి. ఇలాంటి ఆసక్తికర అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కరోనా వైరస్ మానవజాతిని అత్యంత భయానికి గురిచేసింది. ఇది సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 17 లక్షల 80 వేలమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 8కోట్ల 17 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 46లక్షల 20వేల మంది కోలుకున్నారు.

 

భారత దేశంలో కోటి 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే కరోనా వైరస్ భారత్‌లో మహిళలకంటే పురుషులకే ఎక్కువగా సోకింది. à°ˆ విషయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి. లక్షా 47వేల మంది మృతుల్లో 70 శాతం మంది పురుషులేనని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో మృతి చెందిన పురుషుల్లో కూడా 60 ఏళ్ల లోపువారు 45 శాతం మంది ఉన్నారు. ఇక మొత్తం కరోనా కేసుల్లో 63 శాతం మంది పురుషులే ఉన్నారు. వారిలో 52 శాతం 18 నుంచి 44 ఏళ్ల వయసు లోపువారు ఉన్నారు. మిగిలిన 11 శాతం పురుషులే మృత్యువాత పడుతున్నారు.