ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌.

Published: Tuesday January 19, 2021

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హస్తినకు చేరుకున్నారు. రాత్రి 10:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం అందించాలని అమిత్‌షాను సీఎం జగన్‌ కోరనున్నట్లు సమాచారం. జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, పరిపాలన ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్‌ ఉన్నారు.