స్వాతంత్య్ర సంగ్రామానికి నేతాజీ కొత్త దిశనిచ్చారు

Published: Saturday January 23, 2021

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త దిశనిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ నేతాజీ ఉత్తేజపరిచారని అన్నారు. ఆయన దేశం కోసం చేసిన సేవ, త్యాగాన్ని గుర్తుంచుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని మోదీ ఉద్బోధించారు. నేటి భారతాన్ని చూస్తే నేతాజీ చాలా గర్వపడే వారని, ఎల్‌ఏసీ నుంచి ఎల్ఓసీ వరకూ భారత పరాక్రమాన్ని, భారత విశ్వరూపాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మహిళల ప్రాథమిక హక్కుల కోసం పరితపిస్తున్న వేళ.. నేతాజీ ఏకంగా రాణిఝాన్సీ పేరుతో à°“ దళాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్య పోరాటాన్ని అనుసంధానించారని, వారందరికీ తగు శిక్షణ ఇచ్చి దేశ సంగ్రామంలో పాల్గొనేలా చేశారని ప్రధాని మోదీ కొనియాడారు.

నేతాజీ 125 à°µ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్‌కతా మెమోరియల్ హాల్‌లో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేతాజీ స్ఫూర్తితోనే à°ˆ రోజు భారత్ ముందుకు వెళుతోంది. ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలి. అదే మన కర్తవ్యం. à°ˆ సందర్భంగా నేతాజీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి సంవత్సరం జనవరి 23 à°µ తేదీని ‘పరాక్రమ్ దివస్’ à°—à°¾ జరుపుకోవాలని నిర్ణయించాం. ఆత్మనిర్భర భారత్ పేరుతో మనం ముందుకెళ్తున్నాం. నేతాజీ పరాక్రమానికి ప్రతీక. ఆయన జీవన శైలి, తీసుకున్న నిర్ణయాలు, కార్య పద్ధతి... ఇలా ప్రతి ఒక్కటీ మనకు ప్రేరణనిచ్చేవే. స్ఫూర్తిదాయకాలే.’’ అని ప్రధాని మోదీ తెలిపారు.  నేతాజీ లాంటి మొండి వ్యక్తికి, దృఢమైన మనస్సు ఉన్న వారికి ఏదీ అసాధ్యం కాదని, విదేశాలకు వెళ్లి మరీ, విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు నేతాజీ ప్రేరణనిచ్చారని గుర్తు చేసుకున్నారు. కులం, మతం, ప్రాంతం... ఇలా ఏదీ చూడకుండా ప్రతి వ్యక్తినీ సైనికుడిగా తయారు చేశారని, భారత్‌ దాస్య శృంఖలాలను తెంచాలన్న ఒకే à°’à°• సంకల్పంతో నేతాజీ ముందడుగు వేశారని కొనియాడారు.