ఇంటి వద్దకే రేషన్‌

Published: Sunday January 24, 2021

వచ్చే నెల 1à°µ తేదీ నుంచి పేదల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీని అత్యంత పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్‌ రమేశ్‌బాబు అన్నారు. శనివారం ఆయన వీఆర్వోలు, రేషన్‌ డీలర్లు, మొబైల్‌ వ్యాన్‌ ఆపరేటర్లతో ద్రోణంరాజు ఆడిటోరియంలో సమావేశమయ్యారు. మండలంలో 31 రేషన్‌ డిపోల్లో 19 వేల రేషన్‌ కార్డులు ఉన్నాయన్నారు. ఒకటో తేదీ నుంచి 18à°µ తేదీలోగా ఉదయం 6 నుంచి సాయంత్రం 7 à°—à°‚à°Ÿà°² వరకు రోజుకు 90 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయాలన్నారు.