అత్యంత వేగంగా 10 లక్షల మందికి టీకా

Published: Thursday January 28, 2021

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ పోరులో భాగంగా à°ˆ నెల 16à°¨ ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది.  తొలి ఆరు రోజుల్లో ఏకంగా పది లక్షల మందికి పైగా టీకాలు వేసి, అత్యంత వేగంగా à°† ఘనత సాధించిన దేశంగా రికార్డులకెక్కింది. à°ˆ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. అమెరికా 10 రోజుల్లో 10 లక్షల మందికి టీకాలు వేయగా, స్పెయిన్ 12 రోజుల్లో, ఇజ్రాయెల్ 14 రోజుల్లో, యూకే 18 రోజుల్లో, ఇటలీ 19 రోజుల్లో, జర్మనీ 20 రోజుల్లో, యూఏఈ 27 రోజుల్లో à°ˆ ఘనత సాధించాయి.   

వ్యాక్సినేషన్‌లో రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చిన కేంద్రం.. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. ఒడిశా, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆరోగ్య కార్యకర్తలకు 35 శాతానికిపైగా వ్యాక్సినేషన్ కవరేజ్‌తో చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించింది. తమిళనాడు, ఢిల్లీ, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 21 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ కవరేజ్ అయినట్టు పేర్కొంది. వారి పనితీరు మరింత మెరుగుపడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, à°ˆ నెల 28, మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² నాటికి దేశవ్యాప్తంగా 25,07,556 మందికి  టీకా వేశారు