జలశక్తి శాఖ కార్యదర్శిని కలిసిన మంత్రి బుగ్గన

Published: Friday January 29, 2021

జలశక్తి శాఖ కార్యదర్శిని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కలిశారు. పోలవరం సవరించిన అంచనాలు, భూసేకరణ, పునరావాసంపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. à°—à°¤ సర్కారు తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించడంపై విమానయానశాఖ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్‌పై కేంద్రం విద్యుత్‌శాఖతో చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది విద్యుత్ ఆదా చేసే ప్రాజెక్ట్.. కేంద్రసాయం కోరినట్లు వెల్లడించారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న రుణాల రీస్ట్రక్చర్ చేసి వడ్డీ రేటు తగ్గించాలని కోరామన్నారు. పాత ప్రభుత్వాలు చేసిన అప్పు తగ్గించాలన్న ఉద్దేశంతో à°ˆ ప్రయత్నాలు చేస్తున్నట్లు బుగ్గన స్పష్టం చశారు.