బడ్జెట్‌ ప్రసంగంలో ‘టీమిండియా’

Published: Monday February 01, 2021

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి తన బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా ప్రస్తావన తీసుకొచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో à°† దేశ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు అందుకున్న అపూర్వ విజయాన్ని గుర్తుచేశారు. ఆస్ట్రేలియాలో టీమిండియా ఇటీవల సాధించిన చారిత్రక విజయం తర్వాత క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే దేశంగా మనం అనుభవించిన à°† ఆనందాన్ని తాను మళ్లీ గుర్తు చేయలేనని మంత్రి పేర్కొన్నారు. విజయం సాధించాలన్న అమితమైన ఆకాంక్ష మన కుర్రాళ్లలో కనిపించిందని కొనియాడారు.

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నిన్నటి తన ‘మన్ à°•à±€ బాత్’ ప్రసంగంలో టీమిండియాను ప్రశంసించిన తర్వాతి రోజే నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో భారత జట్టును కొనియాడడం గమనార్హం. మోదీ తన ‘మన్ à°•à±€ బాత్’ ప్రసంగంలో భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. జట్టు హార్డ్ వర్క్, టీం వర్క్ à°ˆ రెండు స్ఫూర్తిని రగిలించాయని పేర్కొన్నారు.