కీలక మంత్రులతో సమావేశమైన ప్రధాని మోదీ

Published: Friday February 05, 2021

నూతన సాగు వ్యవసాయ చట్టాలపై సభలో చర్చ జరగాలంటూ విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. à°ˆ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక మంత్రులతో పార్లమెంట్‌లో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పీయూశ్ గోయల్ à°ˆ భేటీకి హాజరయ్యారు. పార్లమెంట్‌లో ఏర్పడ్డ ప్రతిష్టంభనను ఎలా తొలగించాలన్న ప్రధాన అజెండాగానే à°ˆ భేటీ సాగింది. దీంతో పాటు రాష్ట్రపతి ప్రసంగ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. à°ˆ ప్రసంగం కూడా ఎలాంటి అవరోధాలూ లేకుండా ఎలా సాగాలన్న విషయంపై కూడా ప్రధాని మోదీ à°ˆ మంత్రులతో చర్చించినట్లు సమాచారం.